News April 24, 2024
T20 World Cup సెలక్షన్ గురించి చర్చ

T20 World cup విషయంలో ఐపీఎల్లో విఫలమవుతున్న వారిని పక్కన పెట్టి, రాణిస్తున్నవారిని తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. విరాట్, రోహిత్, బుమ్రా, సూర్య, గిల్, జైస్వాల్, రాహుల్, రింకూ సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరితో పాటు పరాగ్, తిలక్, అభిషేక్, శశాంక్, దూబే, డీకే, చాహల్, నటరాజన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. IPLలో పంత్, జడ్డూ, పాండ్య, అర్షదీప్, సిరాజ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
Similar News
News November 21, 2025
‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ను భారత్ సాధించింది.
News November 21, 2025
టుడే టాప్ న్యూస్

*పదోసారి బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణం.. పాల్గొన్న PM మోదీ, అమిత్ షా, CM చంద్రబాబు
*అక్రమాస్తుల కేసులో HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన AP మాజీ సీఎం జగన్
* కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు
* ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRపై ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి
* పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి
News November 21, 2025
సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.


