News August 28, 2025
US సాఫ్ట్ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

టారిఫ్స్ పెంచి భారత్ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.
Similar News
News January 2, 2026
నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.
News January 2, 2026
ఇతిహాసాలు క్విజ్ – 115 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడిని బంధించిన వానర రాజు ఎవరు? తన శక్తితో ఆ రాజు రావణుడిని ఏం చేశాడు?
సమాధానం: రావణుడిని బంధించిన వానర రాజు వాలి. రావణుడు తనను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ధ్యానంలో ఉన్న వాలి చంకలో నొక్కి పట్టుకున్నాడు. 6 నెలల పాటు బందీగా ఉంచుకుని, 4 సముద్రాల మీదుగా ఆకాశంలో విహరించాడు. వాలి బలం ముందు రావణుడి పప్పులు ఉడకలేదు. చివరికి రావణుడు తన ఓటమిని అంగీకరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 2, 2026
ఈ ఏడాది అత్యధిక పెట్టుబడులు APలోనే: లోకేశ్

AP: FY2026లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికం ఆంధ్రాకే దక్కినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. AP(25.3%) అగ్రస్థానంలో తర్వాత ఒడిశా(13.1%), మహారాష్ట్ర(12.8%), TG(9.5%) ఉన్నాయని తెలిపింది. ‘FY2026లో రాష్ట్రానికి 25.3% పెట్టబుడులు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చూడటానికి ఇలాగే ఉంటుంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది’ అని ట్వీట్ చేశారు.


