News October 21, 2024
కాంగ్రెస్తో సీట్ల పంపకాలపై చర్చలు: అఖిలేశ్
UPలో 9 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. అఖిలేశ్ రాజీనామాతో ఖాళీ అయిన కర్హాల్ నుంచి పార్టీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ నామినేషన్ వేశారు. కర్హాల్ తమకు పట్టున్న స్థానమని, ప్రజలు చరిత్రాత్మక తీర్పిస్తారని అఖిలేశ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సంస్థాగతంగా బలంగా ఉన్న స్థానాలను కోరుతామన్నారు.
Similar News
News October 22, 2024
డెలివరీ ఏజెంట్ బూతులు.. క్షమాపణ చెప్పిన జొమాటో
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆఫీస్ సిబ్బంది 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ తీసుకున్నందుకు ఏజెంట్ దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ డెలివరీ బాయ్స్ ప్రవర్తనను మెరుగుపర్చడంపై ఎందుకు ఫోకస్ చేయరు? ఇలా బూతులు తిట్టే హక్కు ఎవరికీ లేదు’ అని పేర్కొన్నారు. దీంతో జొమాటో కేర్ క్షమాపణలు కోరింది. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
News October 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 22, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు అసర్: సాయంత్రం 4:13 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 5:50 గంటలకు ఇష: రాత్రి 7.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 22, 2024
దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతనంగా ఇళ్లు: పెమ్మసాని
AP: PM ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని మంత్రి పార్థసారధి విమర్శించారు.