News October 19, 2024
టూత్పేస్ట్ కొన్నారని 24మంది ఉద్యోగుల తొలగింపు!
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా USలోని తమ శాఖ నుంచి 24మంది ఉద్యోగుల్ని తొలగించింది. సుమారు రూ.2100 విలువైన ఫుడ్ వోచర్లను వారు టూత్ పేస్ట్, డిటర్జెంట్ వంటి సరుకులు కొనడానికి వాడటమే ఆ నిర్ణయానికి కారణం. కొంతమంది ఉద్యోగులైతే తమ భోజనాన్ని ఇంటికి కూడా పార్సిల్ చేశారని మెటా గుర్తించింది. ఆ కూపన్లతో మొత్తంగా 4 లక్షల డాలర్ల లబ్ధి పొందారని తేలడంతో ఆ ఉద్యోగులందరినీ సంస్థ తొలగించినట్లు మెటా వర్గాలు తెలిపాయి.
Similar News
News October 19, 2024
పాకిస్థాన్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్?
పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ను నియమించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్తో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చర్చించినట్లు సమాచారం. ఈ నెల 28న రిజ్వాన్ పేరును పీసీబీ అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టేందుకు బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News October 19, 2024
గవర్నర్ ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారు: స్టాలిన్
TN గవర్నర్గా రవిని తొలగించాలని CM స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారని విమర్శించారు. రవి ఇవాళ హిందీ భాష మాసోత్సవాలకు హాజరయ్యారు. అక్కడ రాష్ట్రగీతం ఆలపించిన బృందం ‘ద్రవిడ’ అనే పదాన్ని స్కిప్ చేసింది. దీంతో గవర్నర్పై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళులను అవమానించడమేనన్నారు. జాతీయ గీతం నుంచి కూడా ద్రవిడ పదం తీసేసే ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు.
News October 19, 2024
T20 WC FINAL: ఎవరు గెలిచినా చరిత్రే
టీ20 వుమెన్స్ వరల్డ్ కప్లో రేపు దుబాయ్లో జరగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతవరకూ ఏ ఐసీసీ ట్రోఫీ సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా తొలిసారి ట్రోఫీ సాధించి హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. కాగా పురుషుల విభాగంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించని విషయం తెలిసిందే.