News April 4, 2025
గ్రూప్1 నియామకాలపై కేసుల కొట్టివేత

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచే అవకాశముంది.
Similar News
News April 11, 2025
అమెరికాపై 125% టారిఫ్ విధించిన చైనా

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికాకు కౌంటర్గా చైనా సుంకాలు పెంచింది. నిన్న చైనా ఉత్పత్తులుపై అమెరికా 145% టారిఫ్ విధించగా ఇవాళ చైనా 125% సుంకం విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బెదిరించాలని చూస్తున్నారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
News April 11, 2025
అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

AP: దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పెన్షన్లు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద అర్హులైన వారికి రూ.15వేలు అందిస్తామన్నారు. మే నుంచి రైతులకు విడతల వారీగా రూ.20వేలు(కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి) ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
News April 11, 2025
నన్నే మోసం చేస్తున్నారు.. మీరో లెక్కా: చంద్రబాబు

AP: సీఎంనైన తననే మోసం చేస్తున్నారని వడ్లమాను సభలో CM చంద్రబాబు తెలిపారు. ‘CMగా ఉన్నప్పుడు ఓరోజు ఉదయం లేచేసరికి YS వివేకానంద గుండెపోటుతో మరణించారని చెప్పారు. కానీ అది గుండెపోటు కాదు.. గొడ్డలివేటు. ఆ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్కా. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ఈ రోజుల్లో వారిని సమర్థంగా ఎదుర్కోవాలి కదా?’ అని అన్నారు.