News September 21, 2025
25న డీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ

AP: మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న నియామక పత్రాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే సమయంపై క్లారిటీ ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అభ్యర్థులకు అందిస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెల 19న జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.
Similar News
News September 21, 2025
మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.
News September 21, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 70 పోస్టులు

<
News September 21, 2025
ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్లో నిరసనలకు దిగారు.