News September 6, 2024
నేటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ: నాదెండ్ల

AP: విజయవాడ వరద బాధితులకు ఇవాళ ఉదయం నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే <<14032631>>సరుకులు<<>> అందిస్తామని, ఒక్క రోజులోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉంటాయి.
Similar News
News October 16, 2025
T20 WCకు అర్హత సాధించిన నేపాల్, ఒమన్

భారత్-శ్రీలంకలో జరిగే 2026 టీ20 ప్రపంచకప్కు ఇప్పటివరకు 19 దేశాలు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నేపాల్, ఒమన్ తమ బెర్తులు ఖరారు చేసుకోగా మరో స్లాట్ ఖాళీగా ఉంది. దాన్ని UAE సొంతం చేసుకునే అవకాశం ఉంది.
జట్లు: భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, USA, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్.
News October 16, 2025
న్యూస్ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ఎల్లుండి నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్
* TG: ఆస్ట్రేలియాలో జరిగే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ప్రసంగించనున్న మంత్రి శ్రీధర్ బాబు
* AP: పాఠశాల విద్యాశాఖలో 382 మంది ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి
* అన్ని ACB కార్యాలయాల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు రూ.52.19 లక్షల మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.