News September 6, 2024
నేటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ: నాదెండ్ల

AP: విజయవాడ వరద బాధితులకు ఇవాళ ఉదయం నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే <<14032631>>సరుకులు<<>> అందిస్తామని, ఒక్క రోజులోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉంటాయి.
Similar News
News December 7, 2025
రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్కోట్, ఇండోర్లో న్యూజిలాండ్తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.
News December 7, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⋆ కాంగ్రెస్ పాలనపై ‘ప్రజా వంచన దినం’ పేరిట HYD ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా.. హామీలపై చర్చకు రావాలని CM రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్
⋆ అసెంబ్లీ స్పీకర్కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. MLAల అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
⋆ ఈనెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షనా? CM జోక్యం చేసుకుని పరీక్షను వాయిదా వేయించాలి: కవిత
News December 7, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<


