News May 26, 2024
పలు రైళ్ల దారి మళ్లింపు

TG: నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు <<13319560>>తప్పడంతో<<>> పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్లు పగిడిపల్లి-కాజీపేట-వరంగల్-కొండపల్లి మీదుగా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరనుంది. గూడ్స్ పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Similar News
News March 14, 2025
SRH కెప్టెన్ను మార్చితే..!

IPL-2025లో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటికి భారత ప్లేయర్లే కెప్టెన్లుగా ఉన్నారు. ఒక్క SRHకు మాత్రమే ఫారిన్ ప్లేయర్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీంతో SRHకు కూడా స్వదేశీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జట్టులో తెలుగు ప్లేయర్ అయిన నితీశ్ కుమార్ రెడ్డికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.
News March 14, 2025
ఆరోగ్య శ్రీ.. ఐదేళ్ల పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’

TG: ఆరోగ్య శ్రీ కింద ఇకపై ఐదేళ్ల వయసు పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ చేయనున్నట్లు ట్రస్ట్ CEO కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు. గతంలో 3yrs వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. పిల్లల్లో వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ సర్జరీ చేస్తారు. దీని వల్ల వినికిడి సమస్య పూర్తిగా తొలగిపోనప్పటికీ కొంత ఉపశమనం ఉంటుంది. ప్రైవేటులో ఈ సర్జరీకి రూ.6-12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.