News December 29, 2024

విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి

image

మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్య‌లు దేశ‌ ఐక్యతా భావాల‌కు పెను స‌వాల్ విసురుతున్నాయ‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజ‌రాత్‌లో ఓ ప్రోగ్రాంలో ఆయ‌న మాట్లాడుతూ ఓట్ల కోసం రాజ‌కీయ నాయ‌కులు చేసే ఈ ర‌క‌మైన రాజ‌కీయం స‌మాజంలో విభ‌జ‌న‌ను పెంచుతుంద‌న్నారు. విభ‌జ‌న సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అస‌మాన‌త‌లు, సామాజిక అన్యాయం సోద‌ర భావానికి ప్ర‌మాద‌మ‌న్నారు.

Similar News

News November 23, 2025

పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

image

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 23, 2025

నేడు భారత్ బంద్

image

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

News November 23, 2025

భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

image

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.