News July 17, 2024
ఇన్స్టాలో విడాకులు ప్రకటించిన దుబాయ్ ప్రిన్సెస్

దుబాయ్ రాజు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె, ప్రిన్సెస్ షైఖా మహ్ర తన భర్త షేక్ మనా బిన్ మహమ్మద్కు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో ప్రకటించారు. దీనికి గల కారణాన్ని సైతం వెల్లడించారు. ‘డియర్ హస్బెండ్.. మీరు సహచరులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున నేను మీకు విడాకులు ఇస్తున్నా. తలాఖ్, తలాఖ్, తలాఖ్. మీ మాజీ భార్య’ అని పోస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే ఈమె బిడ్డకు జన్మనిచ్చారు.
Similar News
News January 25, 2026
చిన్న స్టెప్.. పెద్ద లాభం!

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చే టైపింగ్ సర్టిఫికెట్ తప్పక పొందండి. టైపిస్ట్, స్టెనో, క్లర్క్స్ తదితర ఉద్యోగాలకు డిగ్రీలతో పాటు ఈ సర్టిఫికేషన్ తప్పనిసరి. మనకు సూపర్ ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉన్నా, వాటిని గుర్తించేలా ధ్రువీకరణ పత్రం కావాలి. కాబట్టి తక్కువ సమయమే పట్టే ఈ చిన్న మైల్స్టోన్ మీ క్వాలిఫికేషన్స్ లిస్ట్లో చేరితే ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి.
Share It
News January 25, 2026
ఆ ఛానల్ డిబేట్లలో పాల్గొనం: BRS

TG: ఏబీఎన్ ఛానల్లో జరిగే చర్చల్లో ఇకపై తమ పార్టీ నాయకులు పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్, జిల్లా ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించబోమని ట్వీట్ చేసింది.
News January 25, 2026
సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.


