News September 7, 2024
అలిపిరి నడక మార్గంలో త్వరలో దివ్యదర్శనం టోకెన్లు: టీటీడీ

తిరుమల అలిపిరి నడక మార్గంలో పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని త్వరలో పునః ప్రారంభిస్తామని టీటీడీ తెలిపింది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలందించేందుకు కేంద్రం ప్రాథమికంగా అనుమతి ఇచ్చిందని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ జారీ చేయనుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో శ్రీవారిని 22.42లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
ఐబొమ్మ రవికి బంపరాఫర్?

ఐబొమ్మ రవి కేసులో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడని వార్త సారాంశం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని టాక్.
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.


