News October 30, 2024
దీపావళి: ప్రజలకు అలర్ట్ మెసేజ్లు

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని APSDMA పేర్కొంది. ప్రజల మొబైల్స్కు అలర్ట్ మెసేజ్లు పంపుతోంది. ‘అగ్నిప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించండి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు వెలిగించి విచక్షణా రహితంగా విసరకండి’ అని మెసేజ్ పంపుతోంది.
Similar News
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది


