News October 25, 2024

నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

image

TG: దీపావళి బోనస్‌ను ఈరోజు సింగరేణి కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి ₹93,750 అందనుంది. మొత్తంగా ₹358Cr విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. ఈ బోనస్ సింగరేణిలో పనిచేస్తున్న 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి ₹1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో ₹25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి ₹3లక్షల ప్రయోజనం అందింది.

Similar News

News February 3, 2026

Trade Deal: ఇండియాలో కామన్ మ్యాన్‌కు ఏంటి?

image

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News February 3, 2026

HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

image

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ 12-45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 9- 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.

News February 3, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

image

<>ఇన్‌కమ్ <<>>ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (గుజరాత్) స్పోర్ట్స్ కోటాలో 46 MTS, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో(జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200. వెబ్‌సైట్: https://incometaxgujarat.gov.in