News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?
దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.
Similar News
News October 15, 2024
ఈ ఫర్నీచర్ను 8 రకాలుగా వాడుకోవచ్చు
తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో అన్నిరకాల ఫర్నీచర్ను ఏర్పాటు చేసుకోలేం. దీనికి పరిష్కారంగా IIT గువాహటికి చెందిన ప్రొ.సుప్రదీప్ దాస్ పరిశోధకుల బృందం స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ను ప్రవేశపెట్టింది. దీన్ని 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చైర్, టేబుల్, స్టోరేజ్ యూనిట్గా ఉపయోగపడుతుంది. పరిశోధన క్రమంలో దీనికి రూ.35 వేలు ఖర్చైనా, మాస్ ప్రొడక్షన్తో ధర తగ్గుతుందని చెబుతున్నారు.
News October 15, 2024
వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వయనాడ్ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్నట్లు AICC తెలిపింది. అంతకుముందు ఈ స్థానంలో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. కాగా NOV 13న వయనాడ్ ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పాలక్కడ్ నుంచి రాహుల్ మమ్కుతహిల్, చెలక్కర నుంచి రమ్య పోటీ చేస్తారని కాంగ్రెస్ పేర్కొంది.
News October 15, 2024
సీనియర్గా మంత్రి పదవి ఆశిస్తున్నా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
TG: కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్పారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మహేశ్ గౌడ్కు పీసీసీ చీఫ్ పదవి అదే ప్రాతిపదికన ఇచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిపై అంతిమ నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేశారు. పైరవీలతో మంత్రి పదవులు ఇవ్వరన్నారు.