News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?

దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.
Similar News
News November 23, 2025
సైలెంట్గా iBOMMA రవి..! ఏం చేద్దాం?

నాలుగో రోజు పోలిస్ కస్టడీలోనూ iBOMMA రవి నోరు విప్పలేదని సమాచారం. తన పర్సనల్ విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు తప్ప ఈ వ్యవహారంలో తనతో ఉన్నది ఎవరు? డేటా థెఫ్ట్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రిలేషన్, ఫారిన్ ట్రిప్స్ తదితర అంశాలపై ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నాడట. 5 రోజుల కస్టడీ సోమవారం ముగియనుంది. దీంతో మరోసారి కస్టడీకి అడిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది? ఏం చేద్దామని అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.
News November 23, 2025
AI ఎఫెక్ట్.. అకౌంట్ లాక్ చేసుకున్న ‘బందనా గర్ల్’

సెల్ఫీ వీడియోతో పాపులారిటీ సంపాదించుకున్న <<18363367>>‘బందనా (తలకు కట్టుకునే వస్త్రం) గర్ల్’<<>> ఎక్స్ అకౌంట్ లాక్ చేసుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా కొందరు AI ఫొటోలను క్రియేట్ చేసి దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ‘ఈ రోజు మేకప్ బాగా కుదిరింది’ అంటూ ఆమె ఆటోలో తీసుకున్న 2 సెకన్ల వీడియో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.
News November 23, 2025
సంజూ మరో‘సారీ’

భారత ప్లేయర్ సంజూ శాంసన్కు వన్డేల్లో మరోసారి నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో ఈ స్టార్ ప్లేయర్కు చోటు దక్కలేదు. జడేజా చాలా రోజుల తర్వాత వన్డేలకు ఎంపికయ్యారు. ఎన్నో రోజులుగా చోటు కోసం ఎదురుచూస్తున్న రుతురాజ్ సైతం టీమ్లోకి వచ్చారు. అయితే వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉన్నా రెండేళ్లుగా సంజూను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మీ కామెంట్?


