News October 6, 2025
దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

21వ విడత PM కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా మరో వారంలో అన్నదాతల అకౌంట్లలో ₹2K చొప్పున జమ చేయనుందని నేషనల్ మీడియా పేర్కొంది. EKYC, ఆధార్-బ్యాంక్ లింకు కాలేదంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ పంటల్లో చీడపీడల నివారణ, కొత్త విధానాలు, పాడి, జీవాలకు సంబంధించిన కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News March 24, 2026
వంటగ్యాస్.. భారత్కు శుభవార్త

దేశంలో వంటగ్యాస్ కొరత వేళ హార్ముజ్ జలసంధిని దాటుకొని మరో 2 నౌకలు భారత్కు వస్తున్నాయి. జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే ఎల్పీజీ నౌకలు నిన్న సురక్షితంగా హార్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాబోయే 2 రోజుల్లో ఇవి భారత పోర్టులకు చేరుకోనున్నాయి. వీటిలో సుమారు 92వేల టన్నుల ఎల్పీజీ ఉంది. కాగా ఇప్పటికే <<19419185>>శివాలిక్<<>>, నందాదేవి, జగ్ లాడ్కీ షిప్పులు LPGని తీసుకొచ్చాయి.
News March 24, 2026
అనిల్ ‘మల్టీస్టారర్’ జూన్లో షురూ!

వెంకటేశ్, కళ్యాణ్ రామ్తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని సమాచారం. కామెడీ, యాక్షన్ అంశాలతో స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్గా కీర్తి సురేశ్ను ఖరారు చేశారని, మరో కథానాయిక కోసం మేకర్స్ పలు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.
News March 24, 2026
తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.


