News June 4, 2024

మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ గెలుపు

image

మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. ఆమె 6వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు.

Similar News

News December 27, 2025

నేటి నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) హాల్ టికెట్లు ఇవాళ 11am తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు <>schooledu.telangana.gov.in<<>>లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. JAN 3-20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 9am నుంచి 11.30am వరకు, 2pm నుంచి 4.30pm వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు 2,37,754 మంది అప్లై చేసుకున్నారు.

News December 27, 2025

MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

image

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్‌లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.

News December 27, 2025

శనివారం రోజు చేయకూడని పనులివే..

image

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.