News August 29, 2024

డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఊరట

image

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ CM డీకే శివకుమార్‌పై విచారణ కొనసాగింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. రూ.74 కోట్ల ఆదాయం విషయంలో గత యడియూరప్ప సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో ఈ కేసులో సీబీఐ సహా బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది.

Similar News

News November 9, 2025

BIGG BOSS: ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

image

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌజ్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ ఫేమ్ శ్రీనివాస సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్-5కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది.

News November 9, 2025

RITES 40పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<>RITES<<>>)40 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News November 9, 2025

కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

image

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.