News February 13, 2025
DMEని కలిసిన ASF జిల్లా AITUC నాయకులు

జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని DMEకి ఏఐటీయూసీ నాయకులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
పల్నాడు: పొదుపు సంఘాల ముసుగులో రూ. 20 కోట్ల స్కామ్

పేదరిక నిర్మూలనకు అండగా ఉండాల్సిన సంస్థే పేద మహిళల ప్రాణాలతో చెలగాటమాడింది. బోగస్ పొదుపు సంఘాలను సృష్టించి, బ్యాంకుల నుంచి సుమారు రూ.20కోట్ల మేర అక్రమంగా రుణాలు పొందినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. మహిళలు కష్టపడి చెల్లించిన పొదుపు సొమ్మును కూడా సంస్థ ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ భారీ ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
News December 20, 2025
బంగ్లాను షేక్ చేస్తా.. గర్ల్ఫ్రెండ్తో హాదీ మర్డర్ నిందితుడు

ఉస్మాన్ హాదీ <<18610392>>హత్యతో<<>> బంగ్లా భగ్గుమంటోంది. దీంతో పోలీసులు మర్డర్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఫైజల్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హాదీ హత్యకు ముందు అతడు తన గర్ల్ఫ్రెండ్తో ‘బంగ్లాను షేక్ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని గంటలకే మరో ఇద్దరితో కలిసి అతడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ హాదీ ఒక చెవి నుంచి దూరి మరో చెవిలో నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
News December 20, 2025
హైదరాబాద్లో పండగ షురూ

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పుస్తకాల పండుగలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం ఇందులో 350 స్టాళ్లు కొలువుదీరాయి. రోజూ మ.12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. మొదటి రోజే పుస్తక ప్రియులతో స్టేడియంలో సందడి నెలకొంది.


