News March 6, 2026
DMHOపై భూపాలపల్లి ఎమ్మెల్యే ఆగ్రహం

భూపాలపల్లి జిల్లాలో నేడు హెల్త్ మిషన్ 100 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DMHO మధుసూదన్ గైర్హాజరవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అధికారులను మందలించారు.
Similar News
News April 14, 2026
VZM: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ భార్యాభర్తలు అరెస్ట్

ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను VZM 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల విలువైన 49.147 కిలోల గంజాయి, 2 సెల్ఫోన్లు, రూ.650 స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు. కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్కుమార్ మణి, నిషా బైరపురంతో సహా మరో ఇద్దరు గూడ్స్ షెడ్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది.
News April 14, 2026
విశాఖ: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు

ఆనందపురంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గుడిలోవలోని శివాలయానికి వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్ బంక పైడి రాజు(25), ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా పైడి రాజు మృతిచెందారు. హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
News April 14, 2026
దివ్యాంగుడు శంకర్ది హత్యే: మదనపల్లె CI

మదనపల్లె CTM రోడ్డు, తట్టివారిపల్లె చెరువు కట్టపై అనుమానస్పద స్థితిలో మృతి చెందిన దివ్యాంగుడు శంకర్ది హత్యేనని తాలూక సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ.. కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ ఆదివారం స్థానిక తట్టివారిపల్లె చెరువుపై అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉండటం పాఠకులకు తెలసిందే. శంకర్ను ఆటో డ్రైవర్ మరో యువకుడు హత్య చేసినట్లు తేలిందన్నారు.


