News August 28, 2024

DMK MP కుటుంబానికి రూ.908కోట్ల ఫైన్

image

తమిళనాడుకు చెందిన DMK MP S.జగత్‌రక్షకన్ సహా ఆయన కుటుంబానికి భారీ జరిమానా పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.908కోట్ల పెనాల్టీ విధించింది. దీంతో పాటు FEMA చట్టం కింద రూ.89కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేసింది. FEMA నిబంధనలు ఉల్లంఘిస్తూ విదేశీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు 2021 డిసెంబర్‌లో ఈడీ కేసు నమోదు చేసింది. జగత్‌రక్షకన్ అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News November 25, 2025

మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

image

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్‌లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.

News November 25, 2025

హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

image

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌ వాట్సప్‌ నెంబర్‌: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం పోలీస్‌ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

News November 25, 2025

సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

image

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్‌తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.