News June 11, 2024

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీలు చేయండి: మంత్రి పొన్నం

image

TG: పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్కూల్ బస్సు తనిఖీ చేసి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కారు డోర్లకు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ ఉన్న వాటిపైనా తనిఖీలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

Similar News

News September 11, 2025

ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్‌‌కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.

News September 11, 2025

రేపు Way2News కాన్‌క్లేవ్‌కు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో నిర్వహించే Way2News కాన్‌క్లేవ్‌కు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని మ. 3గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాన్‌క్లేవ్‌కు రానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో అవలంబించాల్సిన విధివిధానాల గురించి చర్చించనున్నారు.

News September 11, 2025

ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.