News September 27, 2024

తిరుపతి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ కావాలా?: అంబటి

image

AP: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఎందుకు నోటీసులు పంపుతున్నారని నిలదీశారు. ‘జగన్ తిరుమల టూర్‌ను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఆయన ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అనడం సిగ్గుచేటు. దీనిపై రాజకీయం చేస్తే ప్రజలు, దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News December 10, 2025

న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

image

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <>ట్వీట్<<>> చేశారు.

News December 9, 2025

OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

image

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

News December 9, 2025

రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

image

AP: పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా ₹40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని CBN అధికారులకు సూచించారు. ₹20 వేల కోట్ల చొప్పున నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రకాశం, రాయలసీమలో 20L ఎకరాల్లో ఉద్యాన పంటల్ని విస్తరించాలని చెప్పారు. ₹58,700 CRతో చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో 200 TMCల గోదావరి నీటిని వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.