News November 17, 2024
బీజింగ్లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Similar News
News January 3, 2026
ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.
News January 3, 2026
కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.
News January 3, 2026
గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను గద్దల్లా పొడవొద్దు: ఈటల

TG: పార్టీలో చేరిన నేతలను గౌరవించి అక్కున చేర్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అంతేతప్ప కాకులు, గద్దల్లా పొడవొద్దని అన్నారు. ‘గ్రూపులు మంచివి కావు. అవి బువ్వ పెట్టవు. మనకు ఉన్న శక్తే తక్కువ. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? రాజకీయాల్లో విశాల హృదయంతో ఆలోచించాలి. శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు’ అని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.


