News November 17, 2024

బీజింగ్‌లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

Similar News

News December 19, 2025

మంచి ఆదాయ మార్గం.. రాజశ్రీ కోళ్ల పెంపకం

image

రాజశ్రీ కోళ్లు అధిక రోగ నిరోధక శక్తిని కలిగి తీవ్రమైన వ్యాధులను సైతం తట్టుకుంటాయి. ఇవి తక్కువ సమయంలో అధిక బరువు పెరుగుతాయి. కేవలం 8 వారాల వయసులోనే 500 గ్రాముల బరువు, 20 వారాల వ్యవధిలో రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి. 160 రోజుల వ్యవధిలో గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏడాదికి 160-180 గుడ్లు పెడతాయి. మాంసం, గుడ్లు రెండింటి కోసం పెంచేవాళ్లకు రాజశ్రీ మంచి ఎంపిక అంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 19, 2025

గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్: కపిల్ దేవ్

image

టీమ్ ఇండియాకు గంభీర్‌ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడమే ప్రస్తుత కోచ్ పని. వాళ్లను ప్రోత్సహించి, స్ఫూర్తి నింపి, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి’ అని చెప్పారు.

News December 19, 2025

సచివాలయాలు.. బదిలీల గడువు పొడిగింపు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల <<18316925>>స్పౌజ్ కేటగిరీ<<>> అంతర్‌జిల్లా బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు పొడిగించింది. గత నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావించినా అనివార్య కారణాలతో అధికారులు గడువును పొడిగించారు. భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉంటే బదిలీలకు అర్హులు. మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయి‌మెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.