News January 5, 2025
కౌలు రైతులకు భూ యజమానులు సహకరిస్తారా?

TG: భూమి లేని నిరుపేదలకు కూడా ఏటా రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కానీ ఏ ప్రాతిపదికన ఇస్తారో ఇంకా వెల్లడించలేదు. ఈలోగా కౌలు రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం కోసం కౌలు పత్రం తీసుకోవాలా? అసలు భూ యజమానులు తమకు సహకరిస్తారా? భరోసా నిధులన్నీ ఒకేసారి ఇస్తారా? అని వారు చర్చించుకుంటున్నారు. భూ యజమానులతో సంబంధం లేకుండా తమకు పథకం వర్తింపజేయాలని అంటున్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


