News October 11, 2024
ఆ 2 నగరాల్లో పావురాలు ఎగరొద్దు: పాకిస్థాన్ ఆదేశం

ఉగ్రవాదాన్ని ఎగుమతిచేసే పాకిస్థాన్ ఇప్పుడు వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. SCO సమ్మిట్కు భద్రత కల్పించడం తలకు మించిన భారంగా మారింది. OCT 12 నుంచి 16 వరకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్డౌన్ చేస్తోంది. ఇక్కడ పావురాలు, గాలిపటాలు ఎగరకూడదని ఆదేశించింది. అందుకని పావురాల గూళ్లను తొలగించాలని సూచించింది. దీంతో మహిళా పోలీసుల సాయంతో 38 రూఫ్టాప్స్పై గూళ్లను తీసేసింది డిపార్ట్మెంట్.
Similar News
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 19, 2025
లక్కీ డిప్కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


