News August 28, 2024

పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దు: టీడీపీ ఎమ్మెల్యే

image

AP: ఎమ్మెల్సీ <<13959849>>పోతుల<<>> సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్ఠానానికి రిక్వెస్ట్ చేశారు. ‘దయచేసి ఊసరవెల్లి లాంటి నాయకులను మన పార్టీలోకి తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లను చేర్చుకుంటే అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయతీగా పోరాడిన వాళ్లను అవమానించినట్టే అవుతుంది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ మధ్యాహ్నం పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు.

Similar News

News December 12, 2025

మహిళలకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటో, వివరాలు ఉంటాయి. ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది.

News December 12, 2025

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్

image

‘అఖండ-2’ సినిమాపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మ.1.15 గంటలకు దీనిపై విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల పెంపుపై పిటిషన్‌ను విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను రద్దు చేసింది.

News December 12, 2025

రెండో విడతలోనూ పై‘చేయి’కి కసరత్తు

image

TG: నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. 2,200+ స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 180+ స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడతలో చూపిన జోరునే ఈ నెల 14న జరిగే రెండో విడత పోలింగ్‌లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. 4,332 పంచాయతీలు, 38,322 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి.