News December 3, 2024

పుష్ప-2ను రిలీజ్ చేయొద్దు.. MLA డిమాండ్

image

‘పుష్ప’ సినిమాపై ఆర్మూర్ బీజేపీ MLA రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటిలాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్‌లను అరెస్టు చేసి, జైల్లో వేయాలి. ఆ మూవీని రిలీజ్ చేయొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.

Similar News

News January 14, 2026

ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

image

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.

News January 14, 2026

గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

image

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.

News January 14, 2026

ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

image

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.