News October 21, 2024
అలాంటి మెసేజ్లకు స్పందించకండి: TRAI

మొబైల్ నంబర్ వెరిఫికేషన్ / డిస్ కనెక్షన్ కోసం యూజర్లకు కాల్స్/మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయి. తాజాగా దీనిపై TRAI స్పందించింది. ఇలాంటి మెసేజ్లు తాము పంపించమని స్పష్టం చేసింది. అలాంటి మోసపూరితమైన కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని కోరింది. అలాంటి వాటిని https://sancharsaathi.gov.inకు తెలపాలంది. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 / cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించింది.
Similar News
News December 20, 2025
ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT
News December 20, 2025
అలాంటి చోట వాస్తు ప్రభావం ఉండదా ?

వేయి గడపలున్న చోట వాస్తు ప్రభావం ఉండదనుకోవడం భ్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ సాంకేతిక, భౌగోళిక అంశాలు. వాటి వల్ల జరిగే నష్టాలను వాస్తుతో ముడిపెట్టకూడదు. చుట్టూ ఎన్ని ఇళ్లు ఉన్నా మన ఇంటి వాస్తు మనకు ముఖ్యం. వాస్తు అనుసరిస్తూనే, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇంటి నిర్మాణం ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 20, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 23 వరకు పలుజిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


