News September 26, 2024
పావురాలకు ఆహారం అందిస్తున్నారా?

పట్టణాల్లో పావురాల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం ప్రజలు వాటికి ఆహారం అందించడమే. అయితే, పావురాల ఈకల నుంచి వెలువడిన ధూళి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని చెబుతున్నారు. పుష్టిగా ఆహారం తీసుకున్న పావురం ఏడాదికి సగటున 11.3 KGల రెట్టలను ఉత్పత్తి చేస్తుంది. ఎండిన రెట్ట నుంచి వచ్చిన వాసనను పీల్చితే శ్వాసకోస రోగాలొస్తాయి.
Similar News
News January 23, 2026
తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ

తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కొత్త సర్కార్ లోడింగ్ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో డీఎంకేకు కౌంట్డౌన్ మొదలైందని చెప్పారు. DMK ప్రభుత్వం CMC (కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కారుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. వికసిత్ భారత్ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకమని చెన్నైలో నిర్వహించిన సభలో మోదీ స్పష్టం చేశారు.
News January 23, 2026
UCILలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 23, 2026
వీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు

బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు ఆహారాన్ని తీసుకుంటారు. దీన్ని సరిగ్గా పాటించకపోతే హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియాకి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించడం సరికాదంటున్నారు.


