News September 26, 2024
పావురాలకు ఆహారం అందిస్తున్నారా?

పట్టణాల్లో పావురాల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం ప్రజలు వాటికి ఆహారం అందించడమే. అయితే, పావురాల ఈకల నుంచి వెలువడిన ధూళి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని చెబుతున్నారు. పుష్టిగా ఆహారం తీసుకున్న పావురం ఏడాదికి సగటున 11.3 KGల రెట్టలను ఉత్పత్తి చేస్తుంది. ఎండిన రెట్ట నుంచి వచ్చిన వాసనను పీల్చితే శ్వాసకోస రోగాలొస్తాయి.
Similar News
News February 5, 2026
కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
News February 5, 2026
‘ధురంధర్’ సరికొత్త చరిత్ర!

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన బాలీవుడ్ చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలవ్వగా 1.3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(1.25 కోట్లు), జవాన్(1.24 కోట్లు), స్త్రీ2(1.11 కోట్లు) ఉన్నాయి.
News February 5, 2026
అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా చర్చలకు డేట్ ఫిక్స్

అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్, యూఎస్ ప్రతినిధుల భేటీకి తేదీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మస్కట్లో చర్చలు జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ట్వీట్ చేశారు. అంతకుముందు అణు ఒప్పందానికి రాకపోతే దాడి తప్పదని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఘాటుగానే <<19025631>>బదులిచ్చినా<<>> తాజాగా చర్చలకు అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.


