News December 10, 2024

ATM నుంచి చిరిగిన నోట్లు వస్తే ఇలా చేయండి!

image

కొన్ని సార్లు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆ ఏటీఎం లింక్ అయిన బ్యాంక్‌కు వెళ్లి విత్ డ్రా చేసిన టైం, తేదీ వివరాలతో ఫామ్ నింపితే మంచి నోట్లు ఇస్తారు. అలాగే చిరిగిన, పాడై‌పోయిన నోట్లనూ ఫామ్ నింపకుండానే మార్చుకోవచ్చు. బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఇలా మార్చుకునేందుకు వీలుంది.

Similar News

News December 17, 2025

VIRAL: రష్మిక బ్యాచిలర్ పార్టీ?

image

విజయ్ దేవరకొండ, రష్మిక <<18465261>>2026లో పెళ్లి<<>> చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె తన గ్యాంగ్‌తో కలిసి శ్రీలంకకు వెళ్లిన ఫొటోలను SMలో షేర్ చేశారు. రష్మికతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ సహా మరికొందరు సన్నిహితులు ఈ ట్రిప్‌లో ఉన్నారు. కేవలం మహిళలతో ఉండటంతో ఇది పెళ్లికి ముందు ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కావచ్చని అభిమానులు అంటున్నారు.

News December 17, 2025

నువ్వుల చేనులో మనుషులతో కలుపు నివారణ వల్ల లాభాలు

image

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.

News December 17, 2025

టారిఫ్‌లను ఆయుధాల్లా మార్చారు: నిర్మల

image

అమెరికా, మెక్సికో టారిఫ్‌లపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా స్పందించారు. ‘సుంకాలు, ఇతర చర్యలతో ప్రపంచ వాణిజ్యం ఆయుధంలా మారుతోంది. భారత్ జాగ్రత్తగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలమే మనకు అదనపు ప్రయోజనం ఇస్తుంది’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం స్వేచ్ఛగా, న్యాయంగా లేదన్నారు. ఇండియాను టారిఫ్ కింగ్ అని, ఇప్పుడు టారిఫ్‌లనే ఆయుధాలుగా వాడుతున్నారని మండిపడ్డారు.