News July 2, 2024
రీఛార్జ్ భారం తగ్గాలంటే ఇలా చేయండి!
Jio, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపుతో యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. అయితే పెరిగిన ధరల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే ఈ ఒక్కరోజు అందుబాటులో ఉండే పాత ధరలతో లాంగ్టర్మ్(ఏడాది) రీఛార్జ్ చేసుకోండి. ఈ మూడు కంపెనీల్లో రూ.2,545 నుంచి రూ.3,099 మధ్య ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. లేకపోతే పెరిగిన టారిఫ్తో ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
Similar News
News September 20, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తెలో వర్షపు చినుకు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే వర్షం నీటిలో పడితే అదే నీటిలో కలిసిపోతుంది. అదే విధంగా ఏదైనా దక్కాలనే ప్రాప్తి ఉంటే అదృష్టము ఎక్కడికీ పోదు.
News September 20, 2024
స్టార్ హోటల్ ఎంట్రన్స్లోనే మలవిసర్జన.. రూ.25 వేల ఫైన్
సింగపూర్లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎదుటే మలవిసర్జన చేశాడు. దీంతో కోర్టు అతడికి రూ.25 వేల ఫైన్ విధించింది. గతేడాది భారత్కు చెందిన రాము చిన్నరాసా అనే కార్మికుడు మెరీనా బే సాండ్స్ రిసార్ట్కు వెళ్లాడు. అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు. తర్వాత మద్యం మత్తులో బాత్రూమ్కు వెళ్లే దారి తెలియక హోటల్ ఎంట్రన్స్లోనే మలవిసర్జన చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
News September 20, 2024
దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.