News November 7, 2024
కులగణనతో లెక్క తేల్చేస్తారా!

తెలంగాణలో కులగణన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇది జస్ట్ టైం పాస్ అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ఏమైందంటూ ప్రశ్నిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సర్వేకు వివరాలు ఇచ్చేది లేదంటున్నారు. అయితే అన్ని వర్గాలకు సర్వేతో ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని, రిజర్వేషన్లు పెరుగుతాయని GOVT చెబుతోంది. TGలో బీసీల లెక్క తేలుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారు.
Similar News
News November 24, 2025
నేడు కొత్త CJI ప్రమాణ స్వీకారం.. తొలిసారి విదేశీ అతిథుల రాక

53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


