News January 29, 2025

చలికాలంలోనూ ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?

image

శీతాకాలంలో ఫ్రిజ్‌లోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు శరీరంలోని జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. ఇవి కఫాన్ని కలిగించటం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, అజీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి వచ్చి దంత సమస్యలు తలెత్తే ఆస్కారముంది. గది ఉష్ణోగ్రత నీటిని మాత్రమే తాగాలి.

Similar News

News December 3, 2025

నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

image

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News December 3, 2025

బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

image

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

News December 3, 2025

ఏపీ న్యూస్ అప్‌డేట్స్

image

*ధాన్యం సేకరణలో రైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు
*పోలవరం ప్రధాన డ్యామ్‌లో రూ.543 కోట్లతో చేపట్టే అదనపు పనులకు ప్రభుత్వం అనుమతి
*విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగుల జీతాల్లో కోత. 100% ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటన. నేడు నిరసనకు కార్మికుల పిలుపు
*హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ డిమాండ్