News January 29, 2025
చలికాలంలోనూ ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?

శీతాకాలంలో ఫ్రిజ్లోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు శరీరంలోని జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. ఇవి కఫాన్ని కలిగించటం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, అజీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి వచ్చి దంత సమస్యలు తలెత్తే ఆస్కారముంది. గది ఉష్ణోగ్రత నీటిని మాత్రమే తాగాలి.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


