News January 29, 2025

చలికాలంలోనూ ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?

image

శీతాకాలంలో ఫ్రిజ్‌లోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు శరీరంలోని జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. ఇవి కఫాన్ని కలిగించటం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, అజీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి వచ్చి దంత సమస్యలు తలెత్తే ఆస్కారముంది. గది ఉష్ణోగ్రత నీటిని మాత్రమే తాగాలి.

Similar News

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.