News March 26, 2025
వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?

కొందరికి చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే వేసవి కాలంలో రెగ్యులర్గా చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ పెరగడం, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు తింటే ప్రమాదం లేదని పేర్కొంటున్నారు.
Similar News
News January 31, 2026
కాలంలో విత్తనాలు కలలోనైనా పోయాలి

వ్యవసాయంలో విత్తనాలు చల్లడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది దాటిపోతే ఎంత కష్టపడినా పంట పండదు. కాబట్టి ఏవైనా అడ్డంకులు వచ్చినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పనిని అస్సలు విస్మరించకూడదు. అలాగే మన నిజ జీవితంలో కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. వాటిని మనం సకాలంలో అందిపుచ్చుకోవాలి. లేదంటే అవి చేయిదాటిపోయాక పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 31, 2026
‘శని త్రయోదశి’ ఎందుకింత పుణ్యమైనది?

శనివారం, త్రయోదశి తిథి కలిసిన రోజును ‘శని త్రయోదశి’ అంటారు. శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది శనివారం. అలాగే ఈ వారానికి ఆయనే అధిపతి. అందుకే ఈ రోజుకు విశేష శక్తి ఉంటుంది. అలాగే త్రయోదశి శివుడికి ఇష్టం. శనివారం విష్ణువుకు ప్రీతికరమైనవి. ఈ కలయిక వల్ల శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నేడు వీరికి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
News January 31, 2026
తిరుమల లడ్డూ వివాదం.. దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కొందరు తమ పార్టీ, నాయకులపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని DGPకి YCP ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. CBI సిట్ ఛార్జ్షీట్లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తున్నారని పేర్కొంది. గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్ల, దర్శితో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించింది.


