News January 23, 2025
రోజూ యాలకులు తింటున్నారా!

ప్రతి రోజు యాలకులను నమిలి రసం మింగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే యాలకులను డైలీ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తశాతం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తశుద్ధి జరిగి విష, వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.
Similar News
News October 22, 2025
TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.
News October 22, 2025
డీఏ జీవోలో మార్పులు

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.
News October 22, 2025
అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం లేదా?

సరైన నిద్ర లేకుంటే శరీరం అధిక కేలరీల ఆహారం కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక నీరసంగా అనిపించి రోజంతా చురుకుగా ఉండలేరు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
Share it