News March 3, 2025

చదివేటప్పుడు నిద్ర కమ్ముకొస్తుందా?

image

అలా అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చదవడం ప్రారంభించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకొని చదవొద్దు. చదివే సమయంలో నీరు ఎక్కువగా తాగండి. గట్టిగా చదవటం, నోట్స్ రాయటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. 50ని.లకు ఒకసారి బ్రేక్ తీసుకొని, ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. మీ రీడింగ్ రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. బ్రేక్‌ టైంలో కాస్త నడిస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. Share It.

Similar News

News March 3, 2025

మనసు ‘దోశే’సిన వంటకం!

image

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.

News March 3, 2025

3 రాజధానులపై YCP యూటర్న్?

image

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.

News March 3, 2025

రోహిత్‌పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్‌పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్‌పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.

error: Content is protected !!