News July 10, 2024
హరిదాస్పూర్ గురించి మీకు తెలుసా?

ఢిల్లీ, ముంబై తర్వాత ప.బెంగాల్లోని హరిదాస్పూర్ నుంచే ఎక్కువ మంది విదేశీయులు దేశంలోకి వస్తున్నారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో ఢిల్లీ ద్వారా 33.25%, ముంబై ద్వారా 15.31% మంది దేశంలోకి ప్రవేశించగా, హరిదాస్పూర్ నుంచి 8.55% మంది వచ్చారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్ బోర్డర్ కావడం, ఇక్కడ దక్షిణాసియాలో అతిపెద్ద ల్యాండ్ పోర్ట్తో పాటు పెట్రాపోల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉండటం ఇందుకు కారణాలుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News January 3, 2026
వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

అంతర్జాతీయ క్రికెట్కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 3, 2026
బాయ్ఫ్రెండ్ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి..

ముంబైలో బాయ్ఫ్రెండ్ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్లో ఉండే మహిళ(25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా అతడు నిరాకరించాడు. దీంతో న్యూఇయర్ వేడుకలని అతడిని ఇంటికి ఆహ్వానించింది. పదునైన కత్తితో మర్మాంగాలపై అటాక్ చేసింది. బాధితుడు పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె పరారీలో ఉంది.
News January 3, 2026
సభా సమరం.. కృష్ణా జలాలపై ఇవాళ చర్చ!

TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ షార్ట్ డిస్కషన్ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ 12PMకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది.


