News November 1, 2024
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసా?

తెలుగు మాట్లాడే రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. పొట్టి శ్రీరాములు దీక్ష, ప్రాణత్యాగంతో 1953 OCT 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని వ్యతిరేకించినప్పటికీ విస్తృత చర్చల తర్వాత ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ (తెలంగాణ) కలయికతో 1956 NOV 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. 2014లో మళ్లీ ఏపీ, తెలంగాణ విడిపోయాయి.
Similar News
News November 15, 2025
దేశమంతా గర్వంగా ఫీలవుతుంది: మహేశ్ బాబు

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. ఇది విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు’ అని గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో మాట్లాడారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయని తెలిపారు.


