News September 21, 2024
‘నందిని’ ఆవు నెయ్యి గురించి తెలుసా?
దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా ‘నందిని మిల్క్’ బ్రాండ్కు మంచి గుర్తింపు ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన Karnataka Cooperative Milk Producers’ Federation Limited ‘నందిని’ బ్రాండ్ పేరుతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తుంది. స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారుచేస్తారు. దీనికి AGMARK సర్టిఫికెట్ కూడా ఉంది.
Similar News
News September 21, 2024
లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక
AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News September 21, 2024
INDvBAN: వరుణుడి పలకరింపు
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న చిదంబరం స్టేడియంలో రాత్రి, తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానంపై కవర్స్ కప్పారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో కవర్స్ను తొలగించారు. ఆటగాళ్లు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అటు ఇప్పటికే 321 రన్స్ ఆధిక్యంలో ఉన్న భారత భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్ను గెలిచే ఛాన్స్ ఉంది.
News September 21, 2024
నటి జెత్వానీ కేసు.. నేడు విజయవాడకు విద్యాసాగర్ తరలింపు
AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు.