News August 28, 2025
ఈ ప్రత్యేకమైన గణనాథుడి గురించి తెలుసా?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
Similar News
News August 28, 2025
మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్

AP: ఉచిత బస్సు ప్రయాణం విషయంలో చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచారని YS జగన్ ఆరోపించారు. ‘11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణమా? అమ్మఒడి తొలి ఏడాది ఇవ్వలేదు. 87 లక్షల మంది పిల్లల్లో 30 లక్షల మందికి ఇవ్వడం లేదు. మహిళలకు మేం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ఉచిత సిలిండర్ల పథకానికి ₹4,100 కోట్లు అవసరమైతే ₹747 కోట్లే ఇచ్చారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’ అని Xలో జగన్ ఫైరయ్యారు.
News August 28, 2025
Mood of the Nation survey: ఇప్పుడు ఎన్నికలు జరిగితే..?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BJP నేతృత్వంలోని NDA 324 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని India Today-CVoter Mood of the Nation survey తెలిపింది. బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండీ కూటమికి 208 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JUL 1 నుంచి AUG 14 వరకు దేశవ్యాప్తంగా 2.06 లక్షల మంది అభిప్రాయాలు సేకరించామని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో BJP 240 సీట్లు సాధించింది.
News August 28, 2025
20 కోచ్లతో నడవనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ దృష్ట్యా కోచ్ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనున్నారు. జులై 31 నాటికి ఈ రైలుకున్న ఆక్యుపెన్సీ ఆధారంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మినహా రోజూ ఉ.6.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరే ఈ రైలు మ.2.35కి తిరుపతి చేరుతుంది. అక్కడ 3.15కు బయల్దేరి రాత్రి 11.40కి SC చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.