News February 19, 2025
దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా..

2025, జనవరి 31 నాటికి దేశంలో 28లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపింది. అందులో 65% అంటే 18.1లక్షల కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయంది. ఇక 5,216 ఫారిన్ కంపెనీలు నమోదవ్వగా అందులో 63% (3,281) యాక్టివ్గా ఉన్నట్టు పేర్కొంది. మొత్తంగా 9,49,934 కంపెనీలు మూతపడ్డాయని వెల్లడించింది. బిజినెస్ సర్వీసెస్లో 27%, తయారీలో 20%, ట్రేడింగ్లో 13% కంపెనీలు పనిచేస్తున్నాయి.
Similar News
News November 28, 2025
‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.
News November 28, 2025
తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్షిప్

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ని కోరారు. ఈ టౌన్షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.
News November 28, 2025
WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు


