News March 30, 2025

ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

image

షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి. చేదు కోసం ఉపయోగించే వేప పువ్వు కడుపులోని నులిపురుగులు తొలగించడంతో పాటు జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. మామిడికాయ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చింతపండు మలబద్ధకాన్ని నివారిస్తుంది, కారం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఉప్పు వల్ల కండరాలకు సత్తువ వస్తుంది. బెల్లంతో రక్తం శుద్ధి అవడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది.

Similar News

News December 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 2, 2025

ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

image

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 2, 2025

శబరి వెళ్లిన ప్రతి ఒక్కరూ 18 మెట్లు ఎక్కవచ్చా?

image

శబరిమలలో 18 పవిత్ర మెట్లను ముక్తికి సోపానాలుగా భావిస్తారు. ఇవి మనలోని 18 పాపపుణ్యాలు, విద్య, ఇంద్రియాలను సూచిస్తాయని నమ్మకం. వీటిని మండల కాల దీక్షా వ్రతం పూర్తిచేసినవారు మాత్రమే ఇరుముడి ధరించి, ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అధిరోహిస్తారు. దీక్ష ధరించకుండా, ఇరుముడి లేకుండా వచ్చిన భక్తులు ఈ మెట్లకు ప్రక్కన ఉన్న సాధారణ మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. <<-se>>#AyyappaMala<<>>