News July 8, 2025

దేశంలో తెలుగు మాట్లాడేవారు ఎంత మందో తెలుసా?

image

భారతదేశంలో సుమారు 22 రాజ్యాంగబద్ధ భాషలతో పాటు వేలాది భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది హిందీ భాషనే మాట్లాడుతుంటారు. దేశంలో హిందీని 54కోట్ల మంది మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత బెంగాలీని 10కోట్ల మంది, మరాఠీని 8.5 కోట్ల మంది, తెలుగును 8.3 కోట్ల మంది మాట్లాడతారని అంచనా వేస్తున్నారు. తమిళం(7.8 కోట్లు), గుజరాతీ(6 కోట్లు), 5.5 కోట్ల మంది ఉర్దూను మాట్లాడుతున్నారు.

Similar News

News July 8, 2025

ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు: లోకేశ్

image

AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమన్నారు. ‘YCP నేతలకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన జ‌గ‌న్‌ గారిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్ర‌జాప్ర‌భుత్వం’ అని వ్యాఖ్యానించారు.

News July 8, 2025

ఫోర్త్ సిటీ: దేశంలో అతిపెద్ద స్టేడియం!

image

TG: CM రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీలో భాగ్యనగర ఇబ్బందులు లేకుండా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత MGBS-చాంద్రాయణగుట్ట మెట్రో రూట్‌ను అక్కడి నుంచి ఫోర్త్ సిటీకి విస్తరించే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇక కొత్త నగరంలో స్పోర్ట్స్ హబ్ ఉంటుందని CM ఇప్పటికే ప్రకటించగా, ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద స్టేడియాన్ని ఇక్కడ నిర్మిస్తారని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

News July 8, 2025

కేటీఆర్ సెకండ్ బెంచ్ స్టూడెంట్: జగ్గారెడ్డి

image

TG: తమకున్న అనుభవాల ముందు KTR జీరో అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. KTR సెకండ్ బెంచ్ స్టూడెంట్. తన తండ్రి ఎమ్మెల్యే సీటు ఇస్తే డైరెక్ట్‌గా గెలిచారు. కేటీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే పది మాటలు అంటాం. అనడం మానేస్తే మేమూ మానేస్తాం’ అని స్పష్టం చేశారు.