News July 29, 2024

గోదావరి స్వరూపం తెలుసా?

image

దక్షిణ గంగగా పేరొందిన గోదావరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ, ఏపీ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై MHలో జయక్వాడీ, బాబ్లీ, తెలంగాణలో శ్రీరాంసాగర్, కడెం, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీలో పోలవరం పూర్తయితే అది అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించనుంది. ఈ నదికి ప్రాణహిత నుంచి భారీ ప్రవాహం వస్తుంది. ఈ నది ఒడ్డున నాసిక్, బాసర, ధర్మపురి, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి.

Similar News

News February 1, 2025

బీజేపీకి మంత్రి సీతక్క కౌంటర్

image

సోనియా గాంధీ రాష్ట్రపతిని అవమానించారన్న BJP <<15320224>>విమర్శలపై<<>> మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘అసలు సమస్యలను దారి మళ్లించడం, కృత్రిమ వివాదాలను సృష్టించడమే BJP ఎజెండా. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని పక్కన పెట్టిన వారికి ఆదివాసీల గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ట్వీట్ చేశారు.

News February 1, 2025

చరిత్ర సృష్టించనున్న నిర్మల

image

2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.

News February 1, 2025

వారికి టెన్త్ విద్యార్హతతో ప్రమోషన్లు

image

TG: అంగన్‌వాడీల్లో ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 2022, AUG 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారు 10th అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్‌తో పాటు 45 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇది వర్తించనుంది.