News February 17, 2025
ఉజ్జయిని క్షేత్ర విశిష్టత మీకు తెలుసా

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ <<15481382>>మూడవది. <<>>పూర్వం ఈ ప్రాంతంలో ఒక శివభక్తుడు ఉండేవారు. అతని కుమారులపై రాక్షస రాజు దాడి చేస్తాడు. అయినా వారు భయపడకుండా శివలింగాన్నిపూజిస్తారు. దీంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుడిని భస్మం చేస్తాడు. అనంతరం అక్కడే స్వయంభుగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే అకాల మృత్యుబాధలు ఉండవని భక్తుల నమ్మకం.
Similar News
News November 27, 2025
బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


