News March 23, 2024

ఎర్త్ అవర్​ను ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?

image

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒకరోజున <<12908046>>ఎర్త్ <<>>అవర్‌ను జరుపుకుంటారు. ఈ ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్‌ను తొలిసారి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రారంభించింది. ఇంధన, సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కేవలం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి WWF శ్రీకారం చుట్టింది. 2007 నుంచి ప్రపంచంలోని 7 వేల నగరాలు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

Similar News

News March 12, 2026

‘జాబ్ క్యాలెండర్’పై రేపు కీలక భేటీ

image

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

News March 12, 2026

‘స్వర్ణ’ ఆఫీసుల్లో తరచూ తనిఖీలు

image

AP: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డుల పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కలెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు 8 కేటగిరీల అధికారులు నెలలో 3-12 సార్లు ఆ కార్యాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అందుతున్న సేవలు, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టిసారించాలంది.

News March 12, 2026

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో FEB 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈనెల 4 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది.