News September 10, 2024
ODI హిస్టరీలో తొలి ‘డబుల్ సెంచరీ’ ఎవరిదో తెలుసా?

ODI క్రికెట్లో ‘డబుల్ సెంచరీ’ అనగానే సచిన్, రోహిత్ గుర్తుకొస్తారు. సచిన్ 2010లో తొలిసారి 200* రన్స్ బాదారు. కానీ అంతకు 13ఏళ్ల ముందే ఆసీస్ మహిళా క్రికెటర్ బిలిందా క్లార్క్ 229* పరుగులు చేశారు. ODI క్రికెట్ హిస్టరీలో ఇదే తొలి డబుల్ సెంచరీ. ముంబై వేదికగా జరిగిన 1997 WCలో డెన్మార్క్పై ఈ ఫీట్ నమోదుచేశారు. ఆమె 54వ పుట్టినరోజు నేడు. ఈ ప్లేయర్ 118 వన్డేల్లో 4,844 రన్స్, 15 టెస్టుల్లో 919 రన్స్ చేశారు.
Similar News
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


