News August 15, 2024
ఆలయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

గుడికి వెళ్లినప్పుడో, ఇంట్లో పూజ చేసినప్పుడో గంట మోగిస్తారు. రాక్షస శక్తులు పోయి దైవ శక్తులు రావాలనే ఉద్దేశంతోనే గంట వాయిస్తారు. ఆలయంలో నందిని ముట్టుకోవడంలోనూ ఓ రహస్యం ఉంది. నంది వేద ధర్మ స్వరూపం కాబట్టి ముట్టుకుంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి చూడటమంటే మనలోని పశుత్వాన్ని పోగొట్టుకుని దేవుడిని దర్శిస్తున్నామని అర్థం. గుడికి రానివారికి పరమేశ్వరుడు ఉన్నాడని గుర్తుచేసేందుకే విగ్రహాలను ఊరేగిస్తారు.
Similar News
News December 26, 2025
ఆస్ట్రేలియా దెబ్బ.. కుప్పకూలిన ఇంగ్లండ్

ASHES SERIES: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఫస్ట్ డేనే రెండు జట్లు కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా ఇంగ్లండ్ అంతకంటే ఘోరంగా 110 రన్స్కే చాప చుట్టేసింది. హ్యారీ బ్రూక్ (41), స్టోక్స్ (16), అట్కిన్సన్ (28) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.
News December 26, 2025
స్టేట్ బోర్డు నుంచి CBSEలోకి స్కూళ్ల మార్పు

స్టేట్ బోర్డుల పరిధిలో ఉన్న స్కూళ్లు క్రమేణా CBSEకి మళ్లుతున్నాయి. TGలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు ఇలా మారాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే 1000 స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NCERT సిలబస్ బోధన వల్ల JEE, NEET సహా పోటీ పరీక్షలకు మేలన్న భావనతో పేరెంట్స్ ఈ స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలూ అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూళ్లు 31879 ఉండగా APలో 1495, TGలో 690 ఉన్నాయి.
News December 26, 2025
అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.


