News February 18, 2025
బయట ఫుడ్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

రెస్టారెంట్ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: 1064 టోల్ఫ్రీతో అవినీతికి అడ్డుకట్ట: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. 1064 టోల్ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఏ పనికైనా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.
News December 8, 2025
YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.


