News September 14, 2024
ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్ను గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఓ దిగ్గజ క్రికెటర్ ఉన్నారు. టెస్టుల్లో ఆయనొక్కరే క్వాడ్రుపుల్ సెంచరీ చేశారు. ఓ పెద్ద జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించారు. తన కెరీర్లో 130కిపైగా టెస్టులు, 290కిపైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు హెడ్ కోచ్గా పనిచేశారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.
Similar News
News November 3, 2025
WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.
News November 3, 2025
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.
News November 3, 2025
పాపికొండల బోటింగ్ షురూ

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.


